మెగా హీరో వరుణ్ తేజ్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టి సినిమా ఫై అంచనాలను పెంచింది. ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను యూఎస్ తెలుగు అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతంచేసుకుంది. ఈ సంస్థ ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ ,మన్మథుడు 2 అక్కడ విడుదల చేయగా భారీ నష్టాలను చవి చూసింది అయితే ఇటీవల అడివి శేష్ నటించిన ఎవరు ను కూడా ఈ సంస్థే అక్కడ విడుదల చేయగా .. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి వారికీ ఊరట నిచ్చింది. మరి ఇప్పుడు వాల్మీకి తోనైనా ఈసంస్థకు భారీ లాభాలు వస్తాయో లేదో చూడాలి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు. కాగా ఈచిత్రంలో వరుణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా అథర్వ యూ జోడిగా డబ్ స్మాష్ ఫేమ్ నటిస్తుంది. ఇక వీరితోపాటు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల ఎఫ్ 2 తో భారీ హిట్టు ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. వాల్మీకి కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు.