సౌత్ లో టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడైన రానా తను ఎంపిక చేసుకునే సబ్జెక్ట్స్ తో, నటనతో సక్సెస్ అయ్యాడు. బాహుబలితో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రానా అంతకుముందే బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. నటనతో పాటు సినీ నిర్మాణంలోనూ భాగస్వాముడవుతూంటాడు. అందుకు ఉదాహరణ గతేడాది సురేశ్ ప్రొడక్షన్స్ లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీకి సమర్పకుడిగా వ్యవహరించాడమే. ఇప్పుడు మరోసారి నిర్మాతగా మారనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 


ఆమధ్య ఒకటి-రెండు హిట్స్ తో యాక్టివ్ గా నటిస్తున్నాడని పేరు తెచ్చుకుని, ఈమధ్య కారు యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ హీరోగా రానా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమా కథ విని తాను ఓ భాగస్వామిగా వ్యవహరించాడు. దీంతో ఆ సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. రిలీజ్ కు ముందు ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం సురేశ్ ప్రొడక్షన్స్, రానా పేర్లే. మంచి కంటెంట్ తో, దర్శకుడి ప్రతిభతో ఆ సినిమా హిట్ అయింది. దీంతో అభిరుచి గల నిర్మాతగా రానా ఇండస్ట్రీలో కొత్త అవతారం ఎత్తాడనే చెప్పాలి. ఔత్సాహికులు తమ కథలను సురేశ్ బ్యానర్ ను మెప్పిస్తే చాలు.. సినిమా ఖాయమనే నమ్మకం ఏర్పడింది. అలాంటి ఓ కథనే ఇప్పుడు రానా విని ఓకే చేసాడని వార్తలు వస్తున్నాయి.

 


రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒకటే.. అనే సినిమా చేస్తున్నాడు. ఈ వార్త నిజమైతే సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. రానా ఈ మధ్య అమెరికాలో ఉన్నాడు. హెల్త్ ఇష్యూ కోసం అని వార్తలు వచ్చినా రానా ఆ వార్తలను ఖండించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: