'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా పై అంచనాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెట్టుకున్నారు. అదేవిధంగా సినిమా ట్రైలర్ ఇంకా సినిమా పోస్టర్లు చూసి కచ్చితంగా ఇది హాలీవుడ్ సినిమా టైప్ అని డిసైడ్ అయిపోయారు ఆడియన్స్. తీరా సినిమా విడుదలయ్యాక సినిమాలో విషయం లేక లేకపోవడంతో మొట్ట మొదటి షోకే ప్లాప్ టాక్ రావటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రభాస్ అభిమానులు. అంతేకాకుండా చాలాచోట్ల సినిమా హాల్లో కుర్చీలు, బల్లలు ఫర్నిచర్ ధ్వంసం చేసి తమ అసహనాన్ని వెళ్లబుచ్చారు.


డైరెక్టర్ సుజిత్ పై సోషల్ మీడియాలో ఇంకా చాలా చోట్ల విమర్శల వర్షం కురిపించారు ప్రభాస్ ఫ్యాన్స్. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మినహా చాలాచోట్ల ఇప్పటికె సినిమా హాలు ఖాళీ చేయడానికి అవటానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో సినిమా రిజల్ట్ గురించి సినిమా యూనిట్ కి సంబంధించిన వారు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇటీవల సుజిత్ వచ్చి వివరణ ఇవ్వగా తాజాగా ప్రభాస్ కూడా వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియాలో సినిమా రిజల్ట్ ఫస్ట్ టైం ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు.


ప్రభాస్ మాట్లాడుతూ..."డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ 'సాహో' పై మీరు చూపించిన ప్రేమ అభిమానానికి చాలా కృతజ్ఞతలు మీ వల్లే ఈ సినిమా మంచి గుర్తింపు దక్కింది" అని సింపుల్ కామెంట్ తో ఆన్సర్ ఇచ్చాడు.  సినిమా విడుదల అవ్వక ముందు దుబాయ్ లో ఉన్న ప్రభాస్ సినిమా రిజల్ట్ వచ్చాక తాజాగా స్పందించడంతో ఈ విషయాన్ని చాలా సింపుల్ గా ప్రభాస్ తీసుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కూల్ అయిపోయారు. ప్రభాస్ దాదాపు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారని మరి కొంత మంది ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: