గ్లామర్ పుష్కలంగా ఉన్న పూజా హెగ్డేకి స్టార్ డం కూడా తోడు అయింది. దాంతో పూజ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె చేతిలో వరసగా సినిమాలు, సూపర్ స్టార్ హీరోల పక్కన చాన్సులు, కోట్లలో రెమ్యునరేషన్. ఓహో పూజా అని తోటి హీరోయినులు అసూయ పడేంతగా ఆమె స్టాట‌స్ ఉంది. ఇపుడు పూజాను చూడాలంటే ఎవరైనా తలెత్తాల్సిందే.  మరి అంతటి స్థాయిలో ఉన్న పూజా చుట్టూ టాలీవుడ్ తిరుగుతోంది.


దీంతో పూజా మేటి నిర్మాతలు, ప్రొడ్యూసర్లకే ట్రబుల్ ఇస్తోందన్న టాక్ వినిపిస్తోంది. పూజా కావాలని అంతా కోరుకోవడంతో ఈ అమ్మడు చెట్టెక్కి కూర్చోదంట. అంతే కాదు  నా టెంపర్ లెవెల్స్ చూపిస్తానంటోందట. ఇపుడు అలా  ఓ సినిమా విషయంలో పూజా చూపిస్తున్న హై రేంజి టెంపర్ కి చిత్ర యూనిట్ గింగిరాలు కొడుతోందట. 


అల్లు అర్జున్ హీరోగా సెట్స్ మీద ఉన్న అల వైకుంఠపురంలో మూవీలో పూజా హీరోయిన్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మూవీని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే పూజా ట్రబుల్ ఇస్తోందని, దాని వల్ల షూటింగ్ లేట్ అవుఇతోందన్న మాట వినిపిస్తోంది. బన్నీ ప్రెస్టేజ్ మూవీగా దీన్ని తీసుకున్నారు. రెండేళ్ళ తరువాత బన్నీ  నుంచి వస్తున్న ఈ మూవీ సూపర్ హిట్ కొట్టాలన్న కసి కనిపిస్తోంది.



త్రివిక్రమ్  సైతం వేగంగానే మూవీని తీసే పనిలో ఉన్నాడు,  అయితే ఇపుడు పూజా వల్ల కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ వినిపిస్తోందట. మరి పూజా ఎందుకు ఇలా చేస్తోంది. ఆమె ట్రబుల్ వెనక కారణాలేంటన్నది చూడాలి. మొత్తానికి సూపర్ స్టార్ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ అలా చేయకూడదనే అంతటా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: