బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన ఎమ్ఎస్ ధోని సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ, ఆ తరువాత తెలుగులో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. అయితే నటించిన తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో, ఇక్కడి దర్శకుల కళ్ళు ఈ అమ్మడు మీద పడ్డాయి. అంతేకాక తొలి సినిమా భరత్ అనే నేనులో తన హొయలొలికించే అందం మరియు అభినయంతో కుర్రకారు మనసు దోచిన కియారా, 

ఆ తరువాత రామ్ చరణ్ మరియు బోయపాటిల కలయికలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇక ఆ తరువాత నుండి కియారాకు టాలీవుడ్ లో మరొక అవకాశం రానేలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి ఆమె నటించిన కబీర్ సింగ్ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో, అక్కడ కూడా ఆమెకు బాగా ఆఫర్లు పెరిగాయి. ఇకపోతే అతి త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కలయికలో తెరకెక్కనున్న ఐకాన్ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్, 

మరికొద్దినెలల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలుత వేరొక హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించారట, అయితే ఆమె కంటే కియారా అయితే ఆ క్యారెక్టర్ కు మరింత ఒదిగిపోతుందని భావించి చివరకు తననే సెలెక్ట్ చేసారని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా విషయమై, నిన్న కియారాను కలిసి కథ కూడా వినిపించారట దర్శక, నిర్మాతలు. కథ తనకు ఎంతో నచ్చడంతో ఆమె కూడా ఐకాన్ కు డేట్స్ కేటాయించిందని సమాచారం. నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల పై ఐకాన్ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: