మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, రాజశేఖర్, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్‌లు ఈ పేర్లు వినగానే మనకు లెక్కలేనన్ని రికార్డులు మరియు ఎవరూ అందుకోలేని అవార్డులు గుర్తుకొస్తాయ. కానీ.. వారితో నటించిన హీరోయిన్లు మత్రం.. ఇప్పుడు వచ్చే పలు సినిమాల్లో.. బామ్మలు, అమ్మల క్యారెక్టర్లలో నటిస్తున్నారు. అప్పటి హీరోల పక్కన ఆడి పాడిన వారు.. ఇప్పటి హీరోలకు అక్కలుగా.. నటించి మెప్పిస్తున్నారు.

ఈ ఎవర్నీ గ్రీన్ హీరోలు ఇప్పటికీ నిత్య యవ్వనంగా ఉంటూ.. ప్రేక్షకులను మాత్రం అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వారి సినిమాలు వస్తూనే ఉన్నాయి.  నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల్లో ఉంటూ.. ఇటు.. సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి  2000వ సంవత్సరం నుంచి.. టాలీవుడ్‌కి దూరమై.. రాజకీయాల్లో ఉండి. మళ్లీ తాజాగా.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చేశారు. ఇక నాగార్జున, వెంకటేష్‌, రాజశేఖర్‌లు కూడా.. అప్పటి నుంచి, ఇప్పటివరకూ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక తమిళ, కన్నడ, హిందీతో పాటు పలుభాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు. వీరికి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ వీరి సినిమాలుకు పెద్ద మార్కెట్ ఉంది చిత్ర పరిశ్రమలో..

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్‌, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జునలతో ఆడిపాడిన జయసుధ, రమ్యకృష్ణ, సుహాసిని, విజయశాంతి, భానుప్రియ, టబూ, రాశీ, లయ, నదియ, రాధిక, మీనాలు సెకండ్ ఇన్నింగ్స్‌ ద్వారా వెండితెరలో మళ్లీ అడుగుపెట్టారు.జయసుధ గారు బామ్మగా, అమ్మగా, అక్కగా.. పలు సినిమాల్లో నటించారు. ఆ తరువాత రమ్యకృష్ణ కూడా.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల ద్వారా అభిమానులను పలకరించి వెళ్లేది.కానీ.. బాహుబలిలో శివగామి గా రీ ఎంట్రీతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది.

మన విజయశాంతి కూడాగత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీ అయిపోయి ఇండస్ట్రీకి దూరమైంది. చాలా రోజుల గ్యాప్ తరువాత ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది విజయశాంతి. ఇక సుహాసిని కూడా.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా.. కొణిదెల నిహారికా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాలో అమ్మగా నటించారు. ఇక రాశీ.. నాగశౌర్య హీరోగా చేసిన.. ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో హీరోయిన్‌‌కి అమ్మగా నటించారు. మరో తెలుగు హీరోయిన్ లయ కూడా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కనిపించి అలరించారు.
ఇలా నిన్నటి తరం హీరోలు మరియు హీరోయిన్లు అలా అందరూ కలవడం ఆనవాయితీ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: