వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్, పూజాహెగ్డే జంటగా నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో బాగంగా హరీశ్ శంకర్ ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా ఫ్లాపైతే హీరోయిన్లదే తప్పని చాలా మంది అంటున్నారని అలా అనడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.నేను సెంటిమెంట్స్ అస్సలు పట్టించుకోను. గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతి హాసన్‌ను తీసుకున్నానని చాలా మంది తిట్టారు.

ఆ అమ్మాయి వద్దు ఐరెన్ లెగ్ అని అన్నారు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథమ్‌లో పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నాను. ఆమెకు ఒక్క హిట్ కూడా లేదు ఎందుకు తీసుకున్నారు అని చాలా మంది అడిగారు. నేను ఇవేవీ పట్టించుకోను. సినిమా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్స్ ఎవరెవరు ఉన్నారు అని వెతుకుతూ కూర్చోను. రామయ్యా వస్తావయ్యా సినిమాలో సమంతను కథానాయికగా ఎంపిక చేసుకున్నాను. ఆ అమ్మాయిది గోల్డెన్ లెగ్. మరి సినిమా ఫ్లాప్ అయిందిగా. నా తొలి సినిమా రవితేజతో తీసిన ‘షాక్’. కానీ ఈ సినిమా ఫ్లాపైంది. ఆ ప్రభావం నాపై చాలా పడింది.

దాదాపు నాలుగేళ్లు సినిమాలు లేకుండా ఉన్నాను. అప్పుడు రవితేజ నన్ను ఐరెన్ లెగ్ డైరెక్టర్ అని అనుకుని ఉంటే ‘మిరపకాయ్’ సినిమాలో అవకాశం ఇచ్చేవారు కాదుగా. ఒక సినిమా ఫ్లాపైందంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. కానీ అందులో నటించిన హీరోయిన్‌దే తప్పని అనడం, ఒక ఆడపిల్లను ఐరెన్ లెగ్ అనడం అమానుషం. ఎవరైనా ఫలానా హీరోయిన్ వల్ల సినిమా పోయింది అంటే నేను ఆ మాటలను అసలు జీర్ణించుకోలేను. నేను ఒక హీరోతో సినిమా చేసినప్పుడు అది ఫ్లాపైతే అదే హీరో పిలిచి నాకు మరో సినిమాకు డైరెక్షన్ చేయమని అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు ఒక హీరోయిన్ నటించిన సినిమా ఫ్లాపైనప్పుడు ఆమెకు మరో సినిమాలో అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అన్నది నేను నమ్మే సిద్ధాంతం’ అని వెల్లడించారు హరీశ్ శంకర్.

తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ‘వాల్మీకి’ రీమేక్‌గా వచ్చింది. ఇప్పటికే సినిమాలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే లుక్స్, అలనాటి పాట ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ రీమిక్స్ పాట సినిమాపై హైప్ పెంచేసింది. భారీ అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.సినిమాలు చేసుకుంటూ ఉంటారు..కానీ ఇలా పరాజయాలు పాపం హీరోయిన్ల మీద వెయ్యడం చాలా దారుణం..కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: