మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి విపరీతమైన అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ సినిమాగా టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, తన కెరీర్ లో తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటించగా, ఆయన సరసన హీరోయిన్ గా నయనతార నటించారు. మరొక హీరోయిన్ తమన్నాతో పాటు అనుష్క శెట్టి, 

నిహారిక కొణిదెల తదితరులు ఇతర ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ సహా మరికొందరు ఇతర భాషల నటులు కూడా నటించడం జరిగింది. ఇక సినిమాలో యాక్షన్, ఫైట్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సెట్టింగ్స్ వంటివి బాగానే ఉన్నాయని, అయితే ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోదని, ఇక సెకండ్ హాఫ్ లో కూడా చాలా చోట్ల ల్యాగ్ ఉందని, ఇక అన్నిటికంటే ఎక్కువగా సినిమా లెంగ్తీ రన్ టైం, సినిమా సక్సెస్ కు కొంత అడ్డంకిగా మారిందని చెప్తున్నారు. 

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మదిని గెలిచారని అంటున్నారు. ఇక నేడు సైరా రిలీజ్ అయి రెండో రోజే అయినప్పటికీ, చాలా చోట్ల ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవైపు సినిమాకు యావేజ్ టాక్ రావడం, అలానే తొలివారం ఈ సినిమాకు డబుల్ రేంజ్ లో టికెట్ రేట్స్ ఉడడడంతో సైరా ను థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకులు నై నై రా అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర భాషల్లో కూడా భారీ రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: