తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమైన తమిళ పొన్ను కీర్తి సురేష్.. రామ్ పోతినేని తో ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె అవకాశాలు వచ్చి పడ్డాయి. ఆ తర్వాత చిత్రంగా నాని నటించిన నేను లోకల్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఈమెకు ఇంకా సినీ అవకాశాలకు కోరత లేకుండా పోయింది. చాలా సినిమాలలో నటించిన ఈ బొద్దుగుమ్మ అన్ని సినిమా ఆమెకు విజయాన్ని అందించాయి. 


తెలుగు ప్రజలు గర్వించ తగ్గ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ కు ఎంటర్ అయింది. బాలీవుడ్ లో రాణించాలంటే హీరోయిన్ స్లిమ్ గా అందంగా ఉండాలి. దానికోసం ఆమె చాలా కసరత్తులు చేసి మరి ఒళ్ళు తగ్గించింది. ఇకపోతే ఆమె బోనికపూర్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తుంది. 


ఆమె చేసిన మహానటి సినిమా ఆమె పేరును మరింత పెంచింది. ఈ సినిమాకు అందరు అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.  అలా అన్ని ఇండస్ట్రీలలో తన హవాను కొనసాగిస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ.. తమిళంలో ‘మిస్ ఇండియా’ అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటించింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.



విషయానికొస్తే కీర్తి సురేష్ చేయబోతున్న 24 వ చిత్రం ఇది. వచ్చే ఏడాదికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది . ఈమె చేసిన ఓ పని సినీ నిర్మాతలు సిగ్గుతో తల దించుకున్నారు. అదేంటంటే ఈము పని చేసిన సినీ యూనిట్ అందరికి ఈమె గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది దానితో పెద్దవాళ్లుగా ఉన్న వాళ్ళు సిగ్గుపడ్డారు. ఓ హీరోయిన్ అయినా కీర్తి అందరికి కాయిన్స్ ఇవ్వడం గ్రేట్ అని అందరు ఆమెను కొనియాడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: