మెగా ఫ్యామిలిలో ఏ హీరోకు ఏ బిరుదు పెట్టినా అది సరిగ్గా సూట్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్..ఇలా చిరు, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్ కి ఉన్న ఈ బిరుదులు వాళ్ళ స్టామినాని చూపించేవే. ఇక బన్నీ కున్న స్టైలిష్ స్టార్ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో ఏ సినిమాలో నటించినా స్టైల్ కంటెంట్ ని కాస్త కూడా తగ్గనివ్వడు సరి కదా అంతకంతకు పెంచుకుంటున్నాడు. కాస్ట్యూమ్ సెలక్షన్ నుంచి.. యాక్టింగ్.. డ్యాన్స్..ఇలా ప్రతిదాంట్లో యాటిట్యూడ్ తో బన్ని స్టైల్ మెగా ఫ్యాన్స్ నే కాదు ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేస్తుంటుంది. అందుకే మెగా హీరోల్లోనే ఛాలెంజింగ్ హీరోగా బన్ని ఎదిగాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక బన్ని కెరీర్ లో త్రివిక్రమ్ చాలా స్పెషల్ అన్న విషయం తెలిసిందే. సుకుమార్ తర్వాత బన్నీ కి చాలా క్లోజ్ అంటే  త్రివిక్రమ్ అన్న మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. 

ఇక బన్ని కి త్రివిక్రమ్ వరుస హిట్లు ఇస్తున్నారు. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి లాంటి క్లాసిక్ హిట్స్ ని తన కెరీర్ కి ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి హ్యాట్రిక్ కోసం చాలా కష్టపడుతున్నారు. కారణం బన్నీ కి మంచి హిట్ పడి చాలా కాలమైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - గీతాఆర్ట్స్ కలిసి భారీగా  ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది. 

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన 'అల వైకుంఠపురంలో' తొలి పాట సామజవరగమన జనాల్లోకి దూసుకెళ్లింది. అంతేకాదు ఈ వీడియో సాంగ్ 2కోట్లు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. ఇక ఇంతకముందు రిలీజైన బన్ని పోస్టర్స్ కు మెగా ఫ్యాన్స్ నుండి అద్భుత స్పందన వచ్చి సినిమా మీద బాగా అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా విజయదశమి సందర్భంగా ' అల ' కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో బన్ని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో యాక్షన్ సీన్స్ ఒక రెంజ్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. 

సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ గా చిత్రీకరిస్తున్నామని చిత్రయూనిట్ చెబుతున్నారు. హారిక హాసిని-గీతా బ్యానర్లు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ను ఎప్పటికప్పుడు ఇస్తూ సినిమా మీద బాగా బజ్ క్రియోట్ చేస్తున్నాయి. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. రాజేంద్రప్రసాద్ - సచిన్ ఖేడ్ కర్- తనికెళ్ళ భరణి- మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. సునీల్-నవదీప్-సుశాంత్- నివేతా పేతురాజ్ పాత్రలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఇక సరిలేరు కి పోటీగా దిగుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: