టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్స్ సాధించి ఉండడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా పై బాగా అంచనాలు ఏర్పడడం జరిగింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన సామజవరగమనా అనే పల్లవితో సాగె సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయింది. యువ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంటూ నేటితో ఏకంగా 30 మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుని ముందుకు సాగుతోంది. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు సమాచారం. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలుపుతూ, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అలానే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ అదిరిపోతాయని టాక్ వినిపిస్తోంది. 

డీజే, నాపేరు సూర్య సినిమాలతో తన అభిమానులను కొంత నిరాశపరిచిన బన్నీ, తప్పకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో కసితో దీనిని తెరకెక్కిస్తున్నారట. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: