దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాలో హీరో ఎవరు విలన్ ఎవరు అనేది పట్టించుకోవడం కొన్నేళ్ళ క్రితమే మానేశారు రాజమౌళి అభిమానులు. రాజమౌళి సినిమా అనే బ్రాండ్ ఆయన సినిమాలకు అంతగా క్రేజ్ తీసుకొస్తుంది. అంతేకాదు అభిమానులపైన ఆయన సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి కూడా తెలిసిందే. కానీ రాజమౌళి ఒక సినిమా అనౌన్స్ చేశాడంటే అది రెండు మూడు సంవత్సరాలకు కానీ రిలీజ్ అవ్వదు. అంతలా ఆయన తన సినిమాలను చెక్కుతూనే ఉంటారు. అందుకే తారక్, రాజీవ్ కనకాల లాంటి వాళ్ళు ఆయన్ని జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పుడు ఆ పేరు కూడా చాలా ఫేమస్ అయిపోయింది. 

ఇక ఆయన తెరకెక్కించే సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ చేయడని రాజమౌళికి ఒక పేరుంది. అది కమెడియన్ సునీల్ తో తీసిన మర్యాద రామన్న విషయంలో కూడా జరిగింది. అయితే ఎంత లేట్ అయినా జక్కన్న సినిమాల కోసం జనాలు ఆతృతగా ఎదురుచూస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక బాహుబలి సినిమాల భారీ విజయాల తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఈ ఇద్దరు హీరోలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తామని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు చూస్తే జక్కన్న టీం చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయడం కష్టమని అర్థమవుతుంది. 

ఎన్టీఆర్, రాంచరణ్ ల ఇద్దరికీ గాయాలయ్యి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత రాంచరణ్ 'సైరా' మూవీ ప్రమోషన్స్ కోసం కొద్దిరోజులు ఈ సినిమాకు దూరంగా ఉన్నాడు. ఇన్ని ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని అనుకున్న సమయానికి విడుదల చేయడం రాజమౌళికి సాధ్యపడే విషయమేనా అని అనుకుంటున్నారు. ఎందుకంటే 'ఆర్ ఆర్ ఆర్' 2020 దసరాకి వస్తుందని కొందరు 2021 సంక్రాంతికి వస్తుందని మరికొందరు అనుకుంటున్నారు. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...లేదా రాజమౌళి ఖచ్చితంగా క్లారిటి ఇవ్వాల్సిందే. మరి ఈ క్లారిటి ఎప్పుడు ఇస్తారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: