జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో తన దృష్టిని మొత్తం పాలిటిక్స్‌పైనే  పెట్టాడు. అంతేకాదు తను సినిమాలు చేస్తున్నట్టు వస్తున్న ప్రచారాలను సైతం బాగా ఖండించాడు కూడా. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. తన దృష్టిని మరల సినిమాలపై కేంద్రకరించినట్టు సమాచారం ఉంది. 


ఇక నుంచి మాస్ సినిమాలు కాకుండా.. జనాలను చైతన్య పరిచే సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం ఉంది. ఇక ఏపీలో ఎలక్షన్స్‌కు మరో ఐదేళ్లు ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ సినిమాలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాడు.


ఇప్పటికే ప్రముఖ దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్‌కు సామాజిక సందేశం ఉన్న మంచి కథ చెప్పినట్టు కూడా సమచారం. ఇక దర్శకుడు క్రిష్ చెప్పిన స్టోరీకి జనసేనాని సరే అని చెప్పినట్టు సమాచారం. క్రిష్ విషయానికొస్తే.. కెరీర్ మొదటి నుంచి ‘గమ్యం’, ‘కంచె’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఎన్టీఆర్ బయోపిక్ వంటి డిఫరెంట్ సినిమాలతో తనేంటో తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. 


ఇందులో కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఫెయిలైనా.. దర్శకుడిగా క్రిష్ మాత్రం ఫెయిల్ కాలేదు అని అందరికి తెలుసు. త్వరలోనే పవన్ కళ్యాణ్.. క్రిష్‌తో చేయబోయే సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హీరోయిన్, నిర్మాత, బ్యానర్ అనే తదితర వివరాలు అతి త్వరలో వెల్లడిస్తారు అని సమాచారం. చాల రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు పవన్. ఈ ప్రకట వాళ్ళ పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: