అశ్విన్ బాబు , అవికా గోర్  ప్రధాన పాత్రల్లో ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్  ఓంకార్  తెరకెక్కించిన  చిత్రం రాజుగారి గది 3.  హర్రర్ కామెడీ  డ్రామా నేపథ్యంలో  తెరకెక్కిన ఈచిత్రం  ఈశుక్రవారం ప్రేక్షకులముందుకు రానుంది. అందులో భాగంగా  ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా  పూర్తి చేసుకుంది.  సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి  యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం  కేవలం రెండు గంటల నిడివితో ప్రేక్షకులముందుకు రానుంది. 



ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేస్తుండండం విశేషం. ఇంతకుముందు ఈ సంస్థ  సాహో , సైరావంటి పెద్ద సినిమాలను అక్కడ విడుదలచేసింది.  మరి ఇప్పుడు ఈ మీడియం బడ్జెట్  సినిమా ను విడుదలచేస్తుందంటే  సినిమా లో విషయం వుండే ఉంటుంది.  ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి  చోటా కె నాయుడు , గౌతమ్ రాజు , సాయి మాధవ్ బుర్ర  వంటి  టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు.  సూపర్ హిట్ మూవీ  రాజుగారి గది సిరీస్ నుండి వస్తున్న మూడో చిత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్  బాగానే జరిగింది.   



ఇక  రాజుగారిగదితో ఓంకార్  డైరెక్టర్ గా కూడా నిరూపించుకున్నాడు.  ఆ సినిమా తరువాత ఓంకార్  ఏకంగా నాగార్జున , సమంత వంటి స్టార్ లతో రాజుగారి గది 2 ను తెరకెక్కించాడు.  అయితే గత ఏడాది విడుదలైన ఈ చిత్రం యావరేజ్  ఫలితాన్ని రాబట్టింది. మరి  ఇప్పుడు ఈరాజుగారి గది 3, ఓంకార్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక సోలో రిలీజ్  కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: