తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ 87 రోజులు దాటింది. ఇన్ని రోజులు కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉంటూ వస్తున్న ఇంటి సభ్యుల తమ కుటుంబ సభ్యుల రాకతో ఉబ్బి తబ్బిబైపోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శివజ్యోతి భర్త గంగూలి రాకతో ఒక్కసారే కన్నీరు మున్నీరైంది. తనకు పప్పీ ఇవ్వాలని కోరింది..ఇంటి సభ్యులకు తన భర్తను పరిచయం చేస్తూ టాస్క్, గేమ్స్ ఎలా ఆడుతున్నానని అడిగింది.
అలీ రెజా సతీమణి మసుమ రావడంతో ఖుషీ అయ్యాడు. ఈ జంట ప్రేమ, ఏమోషన్ చూసి ఇంటి సభ్యులు తెగ సంతోషించారు.
ఇక గంగూలి కూడా శివజ్యోతిని ఎంకరేజ్ చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నావని..ప్రతిదానికి కన్నీరు పెట్టుకోవడం బాగాలేదని అన్నారు. ఇక గంగూలీ వెళ్లిపోయేటపుడు కూడా శివజ్యోతి ఏడుస్తూనే ఉంది. తర్వాత
అలీ రెజాతో తన భర్త ఎలాంటి ఎమోషన్ కావడం లేదని..అసలు ఇన్నిరోజులు దూరంగా ఉన్నానని ఏమాత్రం బాధపడటం లేదని..తనకు దెబ్బ తగిలిన విషయం చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని వాపోయింది. అయినా తన భర్త వచ్చాడు..ఈ రోజు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
ఆ తర్వాత బాబా
భాస్కర్ ఇద్దరు పిల్లలు అర్జున్, లక్ష్య కన్ఫెషన్ రూం నుండి ఇంట్లోకి వచ్చారు. మొదట మీ అమ్మరాలేదా అంటే రాలేదని చిన్న ఝలక్ ఇచ్చారు. తర్వాత బాబా భార్య రేవతి మెయిన్ డోర్ నుండి వచ్చింది. ఫ్యామిలీని చూసిన బాబా భాస్కర్ చాలా ఎమోషనల్ అయ్యారు. తాను వంటలు బాగా చేస్తున్నాని చెప్పడంతో అవును మావారే అందరికీ వండి పెడుతున్నాడా అంటూ ఇంటి సభ్యులను ఆరా తీసింది.
గేమ్ బాగా ఆడుతున్నారు...అప్పుడప్పుడు ఏడుస్తున్నారు..అలా ఎమోషనల్ కావొద్దు అని భర్తకి హితవు పలికింది రేవతి. ఈ రోజు
వరుణ్ సందేశ్ వాళ్ల
భామ వచ్చింది చూపించారు. ఇక మిగతా ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించనున్నారు. వారి వాళ్ళని చూసి మిగతా వారు ఎంత ఎమోషనల్ అవుతారో చూడాలి.