టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటారు మెగాస్టార్ చిరంజీవి.  ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మెగాస్టార్ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించి ఎదిరించి పోరాడిన మొట్టమొదటి తెలుగు బిడ్డ...రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి ’ మూవీలో నటించారు.

ఈ మూవీ ఆయన తనయుడు రాంచరణ్ నిర్మించారు.  ప్రస్తుతం చిరంజీవి 152వ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ మూవీ తో ఘన విజయం అందుకున్న కొరటాల వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  ఇప్పుడు కొరటాల, చిరంజీవి కాంబినేషన్ అనగానే అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే మెగాస్టార్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందన్న విషయంపై ఇప్పటి వరకు సస్పెన్షన్ నెలకొంది. 

ఖైదీ నెంబర్ 150 మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించగా..సైరా మూవీలో నయనతార, తమన్నా నటించారు. మెగాస్టార్ 152 మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష ని తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు స్టాలిన్ మూవీలో చిరంజీవి సరసన నటించింది త్రిష.  అప్పట్లో ఈ అమ్మడు చాలా హాట్ హాట్ గా ఉండేది.  ప్రస్తుతం త్రిష గ్లామర్ పాత్రలు వదిలేసి..తనకు తగ్గ పాత్రల్లో నటిస్తుంది. తెలుగు లో ఈ అమ్మడి సినిమాలు చాలా కాలంగా లేవు..ఇలాంటి సమయంలో త్రిషను తీసుకోవడం ఒకింత మెగా ఫ్యాన్స్ కి అసహనం కలిగించే విషయం అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఒకవేళ ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ - నిర్మాత రామ్ చరణ్   ఏదైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: