నా పేరు సూర్య  తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం  మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్  డైరెక్షన్ లో అల .. వైకుంఠపురములో   అనే చిత్రం లో నటిస్తున్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా  షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. 




ఇక  ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అందులో భాగంగా ఇటీవల  ఈచిత్రం నుండి 'సామజవరగమన' సాంగ్  ను విడుదలచేయగా ఈ  సాంగ్  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్ ను తెచ్చుకుని  సినిమాకు  మరింత హైప్ ను తీసుకొచ్చింది.  యూ ట్యూబ్ లో  ఇప్పటివరకు ఈసాంగ్  40 మిలియన్ల పై  చిలుకు వ్యూస్ ను రాబట్టి సాంగ్ అఫ్ ది ఇయర్  గా రికార్డు సృష్టించింది.  ఇక ఈ చిత్రం నుండి  రెండో సాంగ్ ను  దీపావళి  కానుకగా  విడుదలచేయనున్నారని  తెలుస్తుంది.  




పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   సంక్రాంతి కానుకగా  వచ్చే ఏడాది జనవరి 12న  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇక అదే రోజు  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా విడుదలకానుంది. మరి ఈ రెండు చిత్రాలలో  బాక్సాఫీస్ వద్ద  ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: