అహ నా పెళ్లంట మూవీ తో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి  పరిచయం అయిన వీరభద్రమ్‌, మొదటి సినిమా తోనే మంచి అభిరుచి గల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సునీల్ తో ‘పూలరంగడు’ అనే కమర్షియల్ హిట్ ను కొట్టారు. ఆ తర్వాత నాగార్జున ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.

నాగార్జునతో తీసిన భాయ్ సినిమా తర్వాత ఇతడి కెరీర్ నాశనం అయింది. చాల  గ్యాప్ తీసుకోని ‘చుట్టాలబ్బాయి’ చిత్రాన్ని చేసాడు. ఇది కూడా ప్లాప్ కావడం తో మళ్లీ ఈయన పేరు ఇండస్ట్రీ లో వినిపించలేదు. పేరు మాత్రమే కాదు ఈయన కూడా కనిపించడం మానేసాడు. తాజాగా ఈయనతో  రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రాజశేఖర్ కోసం 2-3 స్టోరీలైన్స్ రెడీ చేశాడట వీరభద్రమ్. ప్రస్తుతం ఆ స్టోరీలైన్స్ పై హీరో-దర్శకుడి మధ్య చర్చలు సాగుతున్నాయి. రాజశేఖర్ ఏ స్టోరీలైన్ కు ఓకే చెబుతాడో, ఆ లైన్ పై వర్క్ చేసి, పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకురావాలనేది వీరభద్రమ్ ప్లాన్ చేస్తున్నారు... మరి ఈ సినిమాను ఎవరు నిర్మస్తారనేది ఇంకా  తెలియాల్సివుంది .సినిమా-సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు రాజశేఖర్. కారణాలు తెలియవు కానీ, ఇ ప్పుడు కొత్త కథల కోసం  రాజశేఖర్ చూస్తున్నారు.

గరుడ వేగ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చారు  రాజశేఖర్. గరుడ వేగ సినిమా తర్వాత కథల ఎంపికలో తీరు మార్చారు ఈ యాంగ్రీ స్టార్. అయిన ,కల్కి ప్లాప్ తో ఈయనతో చేద్దామనుకున్న నిర్మాతలు వేరే హీరోలను నమ్ముకున్నారు. ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్ సినిమా చేస్తానని ముందుకొస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్  ఎలాంటి హిట్ పడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: