తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత సంబురంగా చేసుకుంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ పండుగ కోసం దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు తమ గ్రామాలకు వచ్చి ఎడ్లపందాలు, కోళ్ల పందాలు, పేకాటలతో బిజీ బిజీగా ఉంటారు. ఇక ఆడవారు అయితే రక రకాల పిండి వంటలు, ముగ్గులు, కొత్త బట్టలతో సందడి చేస్తుంటారు.  అయితే సంక్రాంతి అంటే టాలీవుడ్ వర్గాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. 


స్టార్ హీరోల సినిమాలు పనికట్టుకొని మరీ సంక్రాంతికి రిలీజ్ చేస్తుంటారు.  ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్న మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శతమానం భవతి'.. 'శ్రీనివాస కల్యాణం' సినిమాలు మనసుకు హత్తుకునేలా ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా 'ఎంతమంచివాడవురా' సినిమాను రూపొందించాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈ మద్య రిలీజ్ చేశారు.  గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు అర్థమవుతుంది. అంతే కాదు ఈ మూవీ  గ్రామీణ కుటుంబ కథా చిత్రం కావడంతో సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు.

ఇదిలా ఉంటే ఈ పండుగ సందర్భంగా స్టార్ హీరో సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురములో, వెంకిమామ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన  'దర్బార్' వచ్చేస్తుందని అంటున్నారు. ఇంత పోటీ ఉన్నప్పటికీ 'ఎంత మంచివాడవురా' వెనకడుగు వేయడం లేదని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: