సాహో ఇచ్చిన షాక్ నుంచి డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బాహుబలి ని బీట్ చేసి బాక్సాఫీస్ లెక్కలను, బాహుబలి రికార్డ్ లను తిరగరాస్తుందనుకుంటే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలవ్వడం ఎవరూ ఊహించనిది. దీంతో చిత్ర బృందానికి, ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రభాస్ అన్నీ రకాలుగా బాగా నష్టపోయి.. జాన్ వర్క్ లో పడి నెమ్మదిగా సెట్ అవుతున్నాడు. పాన్ ఇండియా ట్యాగ్ తో నార్త్ లో కాస్తో కూస్తో సేఫ్ అయినప్పటికీ అనుకున్న రిజల్ట్ మాత్రం దక్కలేదు. ఇదిలా ఉండగా బాహుబలి కోసం మరోసారి టీమ్ మొత్తం లండన్ లో హంగామా చేయబోతోంది. ఈ నెల 19న లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి సినిమాని ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేయబోతున్నారు. ఇందులోనే కీరవాణి లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మన్స్ కూడా ఉండబోతోంది. నిజంగా బాహుబలి యూనిట్ తో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా ఫీలవ్వాల్సిన సందర్భం అని చెప్పాలి.

ఇప్పటికే ఈ ఈవెంట్ తాలూకు టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుబోతున్నాయి. ప్రభాస్, అనుష్క, రానా లతోపాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. మెమరబుల్ ఈవెంట్ గా డిజైన్ చేసిన ఈ ఈవెంట్ కి ఏర్పాట్లు ప్రత్యేకంగా జరుగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ ఈవెంట్ పూర్తి చేసుకుని అందరు వెనక్కు వస్తుండగా ప్రభాస్ మాత్రం 23న వచ్చే తన పుట్టినరోజు కోసం అక్కడే వేడుకలు చేసుకోబోతున్నాడు. ఇప్పటికే స్నేహితుల కోసం ఇండియా నుంచి బుకింగ్ కూడా చేశాడట.

దీన్ని బట్టి చూస్తే డార్లింగ్ ఫ్యాన్స్ నేరుగా ప్రభాస్ ని బర్త్ డే రోజు చూసే ఛాన్స్ లేనట్టే నని అర్థమవుతోంది. కొత్త సినిమా జాన్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందో ఇంకా చిత్ర బృందం నుండి ఎలాంటి అప్‌డేట్ లేదు. అందుకు ముఖ్య కారణం ప్రభాస్ సూచన మేరకు దర్శకుడు రాధాకృష్ణ స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. వచ్చే వేసవికి లేదా ఏడాది చివరికి రిలీజ్ చేసే అవకాశం ఉన్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 23న రావచ్చని అంతా భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: