నేను శైలజ వంటి సూపర్ హిట్ తర్వాత వరుస ఫ్లాపులు పడ్డ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాస్త గ్యాప్ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాంచి మాస్ హిట్ ని దక్కించుకున్నాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఇప్పటి వరకు కనిపించనంత ఊర మాస్ హీరోగా ఎంతో విభిన్నంగా తెరమీద  కనిపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు పూరి డిజైన్ చేసిన ఇస్మార్ట్ లో రామ్ పాత్రకు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణా భాష, యాస తో అందరిని ఎంతగానో అట్రాక్ట్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో వెంటనే మరో ప్రయోగానికి సిద్దమవ్వకుండా తన నెక్స్ట్ సినిమాను రామ్ ఎంపిక చేసుకున్నాడు. రిస్క్ లేకుండా తమిళ సూపర్ హిట్ సినిమా 'తడమ్' ను రీమేక్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. 

'నేను శైలజ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న ఆయన రామ్ సరసన నటించే హీరోయిన్స్ ను ఫిక్స్ చేశాడు. కథ పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. రామ్ కు జోడీగా నివేధా పేతురాజ్, 'నేల టికెట్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక శర్మను ఎంపిక చేశారని తాజా సమాచారం.

నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి.. సినిమాను వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తమిళంలో తడమ్ సినిమాలో నటించినందుకు గాను అరుణ్ విజయ్ కి మంచి గుర్తింపు రావడంతో పాటు కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ ను అందుకుంది. అందుకే ఈ రీమేక్ కూడా రామ్ కు తప్పకుండా సూపర్ హిట్ ను అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ రీమేక్ రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో నిర్మించబోతున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ హీరోయిన్స్ ఇద్దరికి అసలు ఏమాత్రం క్రేజ్ లేదు. ఇంకా చెప్పాలంటే నేల టికెట్ హీరోయిన్ కి.. చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ హీరోయిన్ అన్న పేరు తెచ్చిపెట్టింది. మరి రామ్ సినిమాకి వీళ్ళిద్దరు ఎంతవరకు హెల్ప్ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: