భారతీయ చిత్ర రంగానికి చేసిన సేవలకుగాను బాలీవుడ్ బిగ్ -బి అమితాబ్ బచ్చన్ ను  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు గత నేత 24 వ తేదీన ప్రకటించిన విషయం తెల్సిందే .. రెండు తరాల సినీ ప్రేక్షకులను తన చిత్రాల ద్వారా  రంజింప చేయడమే కాకుండా,  పలువుర్ని ప్రభావితం చేసిన సీనియర్ బచ్చన్ ను దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్  సినీ ప్రియులకు, అమితాబ్ అభిమానులకు శుభవార్త విన్పించారు . కానీ అంతలోనే   బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురై ఆసుపత్రి లో చేరినట్లు తెలుస్తోంది .


 లివర్ సంబంధిత సమస్య కారణంగా  సీనియర్ బచ్చన్  ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.  ఈ నెల 15 వ తేదీన  రాత్రి రెండు గంటల సమయంలో, తీవ్ర అనారోగ్య సమస్య  కారణంగా  అమితాబచ్చన్ ను  కుటుంబ సభ్యులు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది, అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలుమార్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు .  అయితే ఆస్పత్రిలో చేరిన ప్రతిసారి మెరుగైన ఆరోగ్యం తో తిరిగి వచ్చి పలు  చిత్రాల్లో నటించారు .   ప్రస్తుతం అమితాబచ్చన్ ఒక ప్రముఖ  ఛానెల్ కోసం  పాపులర్ టీవీ షో కౌన్ బనేగా  కరోడ్ పతి  షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది .


ఇక బిగ్ బి బద్లా అనే హిందీ సినిమా లో   వెండితెరపై  కనిపించగా,  మెగాస్టార్  చిరంజీవి హీరోగా  నటించిన బహుభాషా చిత్రం  సైరా నరసింహారెడ్డి సినిమా లో  గోసాయి  వెంకన్న పాత్ర పోషించారు.  రణబీర్ కపూర్ , అలియా భట్ లు హీరో , హీరోయిన్లుగా  నటిస్తున్న బ్రహ్మాస్త్ర  సినిమాలో కూడా అమితాబ్ ఒక  కీలక పాత్ర పోషిస్తున్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: