దీపావళి అంతా తమిళ సినిమాల వాసనతో హోరెత్తబోతోంది. కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్ కార్తీలు నటించిన ‘విజిల్’ ‘ఖైదీ’ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడమే కాకుండా చాల భారీగా ప్రమోట్ చేస్తున్నారు. 

ఈ సందర్భంలో ‘విజిల్’ మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడు అట్లీ కుమార్ నిన్న హైదరబాద్ వచ్చి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. ఆ మీడియా మీట్ లో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ తనకు జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించడమే కాకుండా జూనియర్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. 

తన సినిమాలకు మొట్టమొదటి క్రిటిక్ జూనియర్ అని చెపుతూ తన సినిమా విడుదలైన వెంటనే జూనియర్ ఆమూవీని చూసి తన అభిప్రాయాలు తెలియచేయడమే కాకుండా మంచి సూచనలు కూడా ఇస్తాడు అన్న విషయాన్ని లీక్ చేసాడు. అంతేకాదు తాను ఎప్పటికైనా తెలుగులో మూవీని చేస్తే జూనియర్ తోనే ఒక పవర్ ఫుల్ మూవీని చేస్తాను అన్న లీకులు ఇచ్చాడు. అయితే ప్రస్తుతం అట్లీ ‘విజిల్’ తరువాత షారూఖ్ ఖాన్ తో ఒక మూవీని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ పూర్తి అయి విడుదలయ్యే సరికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. 

దీనితో ఆతరువాత మాత్రమే జూనియర్ అట్లీల కాంబినేషన్ ఉంటుంది అనుకోవాలి. ఇక తమిళ సినిమా డబ్బింగ్ గా విడుదల అవుతున్న ‘విజిల్’ ను ఏకంగా ఇక్కడ 700 థియేటర్లకు పైగా విడుదలచేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో విజయ్ మ్యానియా తెలుగు ప్రేక్షకులలో కూడ పెరుగుతోందా అన్న సందేహాలు కలగడం సహజం. టాలీవుడ్ లో తెలుగు సినిమాల విడుదలకు అమావాస్య సెంటిమెంట్ ఒక అడ్డంకి. ఒక విధంగా తెలుగువారి సెంటిమెంట్ కోలీవుడ్ హీరోలకు అదృష్టంగా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: