'ఎఫ్ 2' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన  విక్టరీ వెంకటేష్ తన తరువాత  సినిమాల్ని జాగ్రత్తగా  ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమాని వెంకటేష్ తెలుగులోకి  రీమేక్ చేస్తున్నారు.  ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది ఈ అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్ కి అసురన్ బాగా నచ్చిందట.  కాగా  అసురన్  తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.  ఇక వెంకటేష్  ప్రస్తుతం  నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న  మల్టీస్టారర్ చిత్రం 'వెంకీ మామ'.  కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.   

కాగా  జనవరి 11న వెంకీమామ సినిమా  విడుదల కానుంది. ఇంకా అధికారిక ధృవీకరణ  జరగనప్పటికీ, మేకర్స్ ఈ తేదీనే తమ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో  చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది.  సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో 'వెంకీ మామ'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.  

 అలాగే వెంకటేష్  ఇప్పటికే దర్శకులు తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కిన ప్రాజెక్ట్స్ ఓకే చేశారట.  వాటిలో ముందుగా తరుణ్ భాస్కర్ సినిమా మొదలవుతుందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా నేపథ్యం కాస్త కొత్తగా ఉండబోతుందట.  హార్స్ రెసింగ్ నెపథ్యంలో ఈ సినిమా సాగుతుందని.. వెంకీ క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని  వినికిడి.  ఈ సినిమా చాలా వరకు  రేస్ క్లబ్ లోనే  చిత్రీకరిస్తారట.  మరి ఈ వార్తల్లో ఏమేరకు నిజముందో తెలియాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: