టాలీవుడ్ దర్శకధీరుడు
రాజమౌళి ప్రస్తుతం
యంగ్ టైగర్ ఎన్టీఆర్,
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాపై కేవలం
టాలీవుడ్ లోనే కాక, యావత్ మన దేశం మొత్తం ఉన్న
సినిమా ప్రేక్షకులు అందరిలోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో
ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇక ఈ
సినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ లేనప్పటికీ, రెండు రోజుల క్రితం కొమరం భీం
జయంతి సందర్భంగా
ఆర్ఆర్ఆర్ టీమ్, ఈ సినిమాలో
ఎన్టీఆర్ కొమరం భీం లుక్ అదిరిపోతుందని మాత్రం చెప్పింది. ఇకపోతే ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్న ప్రముఖ మాటల రచయిత సాయి
మాధవ్ బుర్రా,
ఇటీవల ఒక
మీడియా ఛానల్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి కథ, కథనాల విషయాలు తాను దర్శకుడు
రాజమౌళి అనుమతి లేనిదే బయటపెట్టలేనని ముందుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ
సినిమా భారత దేశ
సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవడం ఖాయం అని మాత్రం తాను చెప్పగలనని అన్నారు. తొలిసారి
రాజమౌళి గారి సినిమాకు మాటలు రాసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని, అసలు
రాజమౌళి గారితో పనిచేయడం అంత ఈజీ టాస్క్ మరొకటి ఉండదని కొంత ఆశ్చర్యకరంగా చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ సినిమాను షూటింగ్ కి ముందే
రాజమౌళి, కథ ప్రకారం తన ఊహల్లో పూర్తి సినిమా ఎప్పుడో చూసేశారని, అలానే తనకు కావలసిన విషయాలను ఎంతో చక్కగా అడిగి రాయించుకుంటారని కూడా ఆయన అన్నారు. అంతేకాక తనకు కావలసిన అవుట్ ఫుట్ పై
రాజమౌళి గారికి ఉండే క్లారిటీ మరొక్క దర్శకుడికి ఉండదని, అందువల్లనే ఆయన దర్శకులందరిలో ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. ఇక సాయి
మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో
ఆర్ఆర్ఆర్ పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అని అర్ధం అవుతోంది. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయనున్నారు....!!