టాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం సక్సెస్ లకు మారుపేరుగా నిలిచి విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్. తండ్రి రామానాయుడు గారు నిర్మాత అయినప్పటికీ, తొలి సినిమా నుండి స్వశక్తితో కష్టపడి ఎంతో పైకి ఎదిగి, అప్పటి నుండి ఇప్పటివరకు మంచి స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్, తన కెరీర్ లో ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ మరియు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చారు. కెరీర్ తొలి నాళ్లలో ఒకింత మాస్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన వెంకీ, ఇటీవల మాత్రం ఆ తరహా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎట్టకేలకు కొన్నేళ్ల తరువాత ఆయన ఒక పక్కా మాస్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 

కొద్దిరోజుల క్రితం తమిళ్ లో రిలీజ్ అయి, సూపర్ హిట్ దిశగా సాగుతున్న అసురన్ తెలుగు రీమేక్ లో విక్టరీ వేంకటేష్ నటిస్తున్నట్లు నేడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మాతగా వి ప్రొడక్షన్స్ సంస్థపై తెరకెక్కిన ఈ సినిమా, ఒక రివెంజ్ డ్రామాగా పూర్తి స్థాయిలో మాస్ మరియు కమర్షియల్ అంశాలతో సాగుతుంది. ధనుష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్ గా నటించడం జరిగింది. 

అతి త్వరలో తెలుగులో వెంకటేష్ హీరోగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు వి క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్ థాను కూడా కలిసి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మొత్తానికి ఎన్నో ఏళ్ళ తరువాత వెంకీ ఒక పక్కా మాస్ సినిమాలో నటించబోతుండడంతో, ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: