టాలీవుడ్ మాస్ మహారాజ
రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన సినిమాలు వరుసగా పరాజయాలు పాలవడంతో, ఇకపై చేయబోయే సినిమాల విషయమై ఆయన మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ
ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
రామ్ తాళ్లూరి నిర్మాతగా డిస్కో
రాజా అనే సినిమాలో హీరోగా ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా నుండి ఇప్పటికే ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయి,
యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ
సినిమా తరువాత ఇప్పటికే తన తదుపరి సినిమాని,
తనతో గతంలో డాన్ శీను, బలుపు సినిమాలు తెరకెక్కించిన
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి
రవితేజ సిద్ధమయ్యారు. లైట్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచి కమర్షియల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వేట మొదలైందట. అయితే అందులో భాగంగా నేడు కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ గా
శృతి హాసన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో
గోపీచంద్ తెరకెక్కించిన బలుపులో కూడా
శృతి హాసన్ నటించడం జరిగింది.
ఇక మరొక్కసారి
రవితేజ సరసన ఆమెనే ఎంపిక చేసిందట
సినిమా యూనిట్. కొన్నాళ్ల నుండి తెలుగు సినిమాలు తగ్గించిన
శృతి, ఈ
సినిమా కథను నేడు విన్న తరువాత ఎంతో నచ్చడంతో, వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ
సినిమా తప్పకుండా తనకు
టాలీవుడ్ లో మంచి సక్సెస్ ని అందించడం ఖాయమని భావిస్తోందట శృతి. మరి ఇప్పటికే తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సినిమాతో అదరగొట్టిన ఈ జోడి, ఈసారి ఏ విధంగా సక్సెస్ సాధిస్తుందో చూడాలి. అయితే దీనిపై
సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!