వరుస విజయాలతో దూసుకెళుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మహర్షి భరత్ అనే నేను వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో మహేష్ కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ బాక్సాఫీస్ దగ్గర తనకు పడాలి అని భావిస్తున్నారట. దీంతో సినిమాకి సంబంధించిన లేటెస్ట్ విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.


కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి షెడ్యూల్లో బిజీ బిజీగా ఉంది. దీంతో రాబోయే దీపావళికి ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి పోస్టర్ని విడుదల చేయాలని సినిమా ఎడిట్ భావిస్తున్నారట. విడుదల చేసే విజయశాంతి పోస్టర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నవంబర్ లో చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ కానుంది.  ఇక మహేష్ మాత్రం డిసెంబర్ నుంచి తన అసలైన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడట.


సినిమాలో నటించిన కమెడియన్స్ ని మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ చేననున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో సంక్రాంతి సీజన్ కి అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంబులో అనే సినిమా కూడా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసినదే. దాదాపు మహేష్ సినిమాతో సరిసమానంగా బన్నీ సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కలెక్షన్స్ ఎంత లాగినా.. ఆ సంక్రాంతి మూమెంట్ లోనే వసూలు సాధించాలని మహేష్ స్పెషల్ ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని దిల్ రాజు కూడా చిత్ర యూనిట్ తో మహేష్ భారీ ప్లాన్ వేసినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: