బాలీవుడ్ లో ఛాలెజింగ్ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ రేంజ్ సెట్ చేసుకున్న
తార కంగన రనౌత్. ప్రతీ చిత్రం డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా మణికర్ణిక విజయంతో జోష్లో ఉన్న కంగన రనౌత్ మరోసారి ఛాలెజింగ్ సినిమాతో రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఓ తమిళ రీమేక్ చిత్రంలో నటించేందకు పచ్చ జెండా ఊపిందనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమలాపాల్ హీరోయిన్ గా నటించిన అడై (తెలుగులో ఆమె) చిత్రం రీమేక్ లో నటించేందుకు కంగన ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు పొందింది. కమర్షియల్ ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయినప్పటికి దీనిలో కథకు అనుగుణంగా నగ్నంగా నటించిన అమలాపాల్ కు మంచి మార్కులే పడ్డాయి. కథనంపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ చిత్రం కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యేదని కొంతమంది సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు .
ఇప్పుడు అదే అడై సినిమాను బాలీవుడ్లో రీమేక్గా మలుస్తున్నారనే విషయం దీనికోసం ప్రముఖ నిర్మాత
ముఖేష్ భట్ రీమేక్ హక్కులను సొంతం చేసుకొన్నట్టు
కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. . ఈ సినిమాకు రథ్ కుమార్ను దర్శకుడిగా తీసుకునే అవకాశమున్నట్లు
బాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
తమిళంలో అమలాపాల్ పాత్రను కంగన రనౌత్తో చేయాలని నిర్మాత
ముఖేష్ భట్ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఒకవేళ అన్ని కుదిరితే కంగన రనౌత్ ఆమెగా హిందీలో కనిపించబోవడం ఖాయమనే కామెంట్లు విన్పిస్తున్నాయి.
కాగా అడై లో అమలాపాల్ నగ్నంగా నటించిన సీన్లు సినిమాకు అత్యంత క్రేజ్గా మారగా. అదే పాత్రను చేస్తే కంగన రనౌత్ చేస్తే ఆ సీన్లో ఆమె నటిస్తుందా? లేక కథలో ఏమైనా మార్పులు చేస్తారా అనే అంశంపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా త్వరలోనే అధికారికంగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించే అవకాశమున్నట్లు సమాచారం