బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ లో నటించిన విషయం తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది.  టీజర్ ని చూస్తుంటే దబాంగ్ పార్ట్ 1 గుర్తుకు వస్తుంది.   ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సల్మాన్ సరసన నాయికగా సోనాక్షి సిన్హా నటించింది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.  ఇక టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

గతంలో అమితాబచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్‌ సినిమాను తెరకెక్కించాడు.  అప్పట్లో  ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు అమితాబ్‌ కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్‌గా నిలిచిపోయింది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ మూవీ హిందీలో వాంటెడ్ గా రిమేక్ చేశారు.  ఈ మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.   ఈ మూవి బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుసగా రీమేక్‌ సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్నాడు సల్మాన్. అప్పటి నుంచి సల్మాన్‌ సౌత్‌ టెక్నీషియన్స్‌తో కలిసి పని చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడు.

తాజాగా దబాంగ్‌ 3 ప్రమోషన్‌ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్‌.తాజాగా దబాంగ్ 3 ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఓ వేదికపై మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తనతో సినిమా చేస్తానంటే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు.   విజయ్ దేవరకొండతో 'ఫైటర్' పూర్తికాగానే, సల్మాన్ తో పూరి సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్యంలేదని చెప్పుకుంటున్నారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: