బాలీవుడ్
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది. టీజర్ ని చూస్తుంటే
దబాంగ్ పార్ట్ 1 గుర్తుకు వస్తుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో,
సల్మాన్ సరసన నాయికగా
సోనాక్షి సిన్హా నటించింది.
డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న డాషింగ్ డైరెక్టర్
పూరి జగన్నాథ్కు బాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
గతంలో అమితాబచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఈ
సినిమా ఘనవిజయం సాధించటమే కాదు అమితాబ్ కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలిచిపోయింది. ఇక
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
మహేష్ బాబు నటించిన ‘పోకిరి’
మూవీ హిందీలో వాంటెడ్ గా రిమేక్ చేశారు. ఈ మూవీకి
ప్రభుదేవా దర్శకత్వం వహించగా
సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ మూవి
బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ
సినిమా ఇచ్చిన జోష్తో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్నాడు సల్మాన్. అప్పటి నుంచి సల్మాన్ సౌత్ టెక్నీషియన్స్తో కలిసి పని చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.
తాజాగా దబాంగ్ 3 ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్.తాజాగా
దబాంగ్ 3 ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా
సల్మాన్ ఓ వేదికపై మాట్లాడుతూ..
పూరి జగన్నాథ్ తనతో
సినిమా చేస్తానంటే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు. విజయ్ దేవరకొండతో 'ఫైటర్' పూర్తికాగానే,
సల్మాన్ తో
పూరి సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్యంలేదని చెప్పుకుంటున్నారు.