తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా అతి తక్కువకాలంలో టాప్ రేంజ్ కి దూసుకెళ్ళిన హీరోయిన్ రకుల్ అని చెప్పాలి. ఇక కోలీవుడ్ లోను కొన్ని సినిమాలు చేసింది రకుల్. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని చూసింది. అటునుంచి బాలీవుడ్ లోను తన లక్ ని పరీక్షించుకుంది. అక్కడకూడా అజయ్ దేవగన్ వంటి స్టార్ తో నటించి ఒకే అనిపించుకుంది. కానీ ఉన్నట్టుండి తెలుగులోనే రకుల్ బాగా వెనకబడిపోయింది. ఆ మధ్య అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 పెద్ద డిజాస్టర్ కావడంతో రకుల్ బాగా డిసప్పాయింట్ అయింది. కానీ కాస్తో కూస్తో బాలీవుడ్ లో మాత్రం నెట్టుకొస్తుంది. 

ప్రస్తుతం అవకాశాల పరంగా రకుల్ కి డోఖా లేదు. కమల్ హాసన్ సరసన భారతీయుడు 2లో .. శివకార్తికేయన్ సరసన ఓ ప్రయోగాత్మక సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన అవకాశం అందుకుంది. అంతేకాదు వీటితో పాటు మరిన్ని కమర్షియల్ ఎంటర్ టైనర్స్ సంతకాలు చేయబోతోందని సమాచారం. ఆ క్రమంలోనే యువ హీరోలైన విజయ్ దేవరకొండ, రణవీర్ సింగ్ వంటి వాళ్ళతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని ప్రకటించింది. ఇక రీసెంట్‌గా రకుల్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా `మర్జవాన్`. ఈ సినిమా నుండి త్వరలో ఓ పాటను రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. ఇది ప్రత్యేకించి రకుల్ పై ఫోకస్ చేసిన స్పెషల్ సాంగ్ అని బాలీవుడ్ మీడియా టాక్. `సబ్ కి జాన్ లేనే ఔర్ జాన్ బాన్ నే.. ఆ రహి హై హర్ దిల్ కి ఆర్జూ... ఆర్జూ..! హైయా హో..!! అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేయనున్నారట. నవంబర్ 15న సినిమా రిలీజ్ కాబట్టి ప్రమోషనల్ కార్యక్రమాలని మొదలుపెట్టారు చిత్రబృందం.

ఇక తాజాగా ప్రచారంలో భాగంగా సాంగ్ రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ ని రకుల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో సంథింగ్ హాట్ గానే కనిపిస్తున్న రకుల్ ఒక నర్తకి తరహాలో ఇచ్చిన ఫోజు చూస్తుంటే ఇందులో తన పాత్ర ప్రత్యేకత ఏంటో అర్థమవుతోంది. ఇట్స్ రకుల్ టైమ్ స్టార్ట్స్ అనేలా పోస్టర్ కనిపిస్తోంది! రితేష్ దేశ్ ముఖ్- సిద్ధార్థ్ మల్హోత్రా- తారా సుతారియా- తనిష్ కె బాగ్చి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: