టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే వచ్చిన జులాయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్లో మరో సారి హిట్ కొట్టేందుకు అలా వైకుంఠపురములో  చిత్రం తో  ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తుంది . అయితే ఈ సినిమాలో ఈమధ్య విడుదలైన సామజ వర గమన పాట సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న అలా వైకుంటపురం లో చిత్రంలో సామజ వర గమన పాట విడుదలైనప్పటి నుంచి... యూట్యూబ్ లో సంచలనం గా మారింది. 



 యూట్యూబ్ లో ఎక్కువ మంది లైక్ చేసిన పాట గా రికార్డు సృష్టించింది సామజవరగమన పాట. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కూడా పంచుకుంది. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సాంగ్ కి రానంత రేంజిలో లైక్ లు సంపాదించింది ఈ పాట. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రాములో  రాములు అంటూ మాస్ సాంగ్ ను విడుదల చేసారు. కాగా  ఇప్పటికే విడుదలైన సామజ వర గమన పాట నెటిజన్లు  అందరిని అలరించింది. ఇక ఇప్పుడు విడుదలైన రాములో  రాముల పాట సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఎవ్వరి  నోట విన్నా ఈ పాట వినిపిస్తోంది. మాస్ బీట్ ఉన్న పాట కావడంతో నెటిజనులు ఈ పాటకు తొందరగా కనెక్ట్ అయి పోయారు. 



 అయితే ఈ సాంగ్ విడుదలైన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 8.3 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియా పరంగా... రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ సరికొత్త రికార్డు సృష్టించింది ఈ పాట. కాగా ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా  అలవైకుంఠపురములో  సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే పూజా హెగ్డే అల్లు అర్జున్ కాంబినేషన్ లో డిజె సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అలా వైకుంటవురములో సినిమా  విడుదల కాబోతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: