ప్రస్తుతం పాలిటిక్స్ లో ఎంతో యాక్టివ్ గా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవల తన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. అయితే ఊహించని విధంగా అనూహ్యంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఘోరంగా ఓడిపోవడంతో పాటు, రాష్ట్రం మొత్తం మీద ఆయన పార్టీకి కేవలం ఒకే ఒక్క సీట్ లభించడం జరిగింది. ఇక అక్కడి నుండి తన పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి మరింత చేరువవ్వాలని భావించిన పవన్, ప్రస్తుతం పలు ప్రణాళికలు రచిస్తున్నారు. 

ఇకపోతే గత ఏడాది ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో, ఓవైపు ఫ్యాన్స్ కూడా ఆయన తమ కోసం ఒక్క సినిమా చేయాలని కోరుతుండడంతో, ఇకపై సినిమాలు చేసే ఆలోచన లేదని చెప్పిన పవన్, వారి కోసం ప్రస్తుతం ఒక సినిమాలో నటించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారట. ఈ విషయమై మూడు రోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ, నేడు అది ఖాయమయినట్లు ఆయన సన్నిహితుల నుండి కన్ఫర్మేషన్ వచ్చినట్లు చెప్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తారని, మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ అంశాల కలయికగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ, కొంత చారిత్రక నేపథ్యంలో తెరకెక్కబోతోదని అంటున్నారు. 

అందుకోసం నిర్మాత ఏఎం రత్నం ఎన్ని కోట్లు అయినా తాను ఖర్చు పెట్టడానికి సిద్ధమని డేరింగ్ డెసిషన్ తీసుకున్నారట. అంతేకాక సినిమా కాస్ట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదని, పవన్ గారి కోసం ఎంత ఖర్చు చేయడానికి తాను సిద్ధమేనని అన్నట్లు టాక్. అయితే పవన్ తో కలిసి ఆయన మొదట తీసిన ఖుషి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, రెండవ సినిమాగా వచ్చిన బంగారం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మరి మూడవ సారి తీయబోయే ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: