టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి నటించిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా నటించారు.  టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి అనూహ్యంగా రాజకీయాల్లోకి వెళ్లారు. దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి.  సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా, దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ స్టిల్ లో కాస్త గర్వం కనిపిస్తూనే నవ్వుతో.. హుందా లుక్‌లో.. నాకు నేనే సాటి అన్నట్లుగా అదరగొట్టేస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి విజయశాంతిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో తనకు సినిమాల్లో నటించాలని ఎన్నో ఆఫర్లు వచ్చినా..ఓ పవర్ ఫుల్ పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంత సమయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.  అనీల్ రావిపూడి కథ చెప్పిన తర్వాత ఆ పాత్ర ఎంతో నచ్చింది..అందుకే రీ ఎంట్రీ ఇచ్చానని అన్నారు.

ఇక మహేష్ బాబు తో ఈ మూవీలో మధ్య నువ్వా? .. నేనా? అంటూ సాగే పవర్ఫుల్ సీన్స్ వుండనున్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు..నాకూ మహేశ్ బాబుకు మధ్య పోటాపోటీ సన్నివేశాలేమీ వుండవు. ఛాలెంజ్ చేయడం .. సవాళ్లు విసురుకోవడం లాంటి సీన్లు అస్సలు లేవు..సినిమా ఎంతో అహ్లాదంగా మంచి రిలేషన్ షిప్ తో సాగుతుంది. ప్రేక్షకులకు మా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి అని చెప్పుకొచ్చారు. మరి రాములమ్మ రీ ఎంట్రీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో జనవరి 12 వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: