పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ గారు మళ్ళి సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు గత కొద్దిరోజలుగా విపరీతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, రెండు రోజుల నుండి మాత్రం ఆయన తదుపరి నటించబోయే 26వ
సినిమా ఓకే అయినట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.
పవన్ సన్నిహితులు కొందరు ఈ విషయాన్ని కూడా ధృవీకరించినట్లు ఫిలిం
నగర్ వర్గాల నుండి టాక్ వినపడుతోంది. గమ్యం
మూవీ ఫేమ్
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.
మంచి సామజిక అంశంతో పాటు
పవన్ ఇమేజీకి తగ్గట్లుగా సరిపోయే సరైన కథని
క్రిష్ ఇటీవల ఆయనకు వినిపించడం జరిగిందని, అది విన్న
పవన్ వెంటనే నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో
హీరోయిన్ గా ఇటీవల
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న
భామ నయనతార,
పవన్ ప్రక్కన
హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అప్పుడే
క్రిష్ కూడా నయన్ కు కథ చెప్పటానికి సిద్ధం అయ్యారని,
మరొక రెండు రోజుల్లో
చెన్నై వెళ్లి ఆమెను కలిసి కథ వినిపించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఆమె కూడా ఒప్పుకున్న తరువాత ఈ
నవంబర్ నెల రెండవ వారంలో సర్వం సిద్ధం చేసి,
సినిమా విషయమై అధికారిక ప్రకటనతో పాటు ఘనంగా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం,
పవన్ ఫ్యాన్స్ కి కి అతి పెద్ద
పండుగ వార్తే అని చెప్పాలి. మరి పవర్ స్టార్ ఎంతవరకు తన తదుపరి సినిమాలో నటించి అభిమానుల ఆశలు నెరవేరుస్తారో చూడాలి....!!