యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్
మూవీ ఆర్ఆర్ఆర్ లో కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ అల్లువారి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాపై
టాలీవుడ్ సహా యావత్ భారత దేశంలోని
సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ
సినిమా కోసం భారీగా డేట్లు కేటాయించిన
ఎన్టీఆర్ మరియు
రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఇది పూర్తి అయ్యేవరకు మరొక సినిమాలో నటించకూడదని నిర్ణయించినట్లు ఇటీవల
ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో వారిద్దరూ చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారమే వారు కూడా ఇప్పట్లో మరొక సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారట.
అయితే మధ్యలో తమ కోసం కథలు వినిపించడానికి వస్తున్న దర్శకుల వద్ద నుండి పలు కథలు వింటున్న ఈ ఇద్దరు హీరోలు, ఒకవేళ తమకు కథ నచ్చి అది ఫైనలైజ్ అయితే మాత్రం, దానిని వచ్చే ఏడాది జూన్ తరువాతే మొదలెడతాం అని మాట ఇస్తున్నారట. ఇక ఇటీవల వార్తలు ప్రచారం అవుతున్నట్లుగా మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై
ఎన్టీఆర్ చేయబోయే
సినిమా కథ విషయమై కెజిఎఫ్ దర్శకుడు
ప్రశాంత్ నీల్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో
ఎన్టీఆర్ కు చెప్పిన ఒక కథ పాయింట్ ని మరింతగా డెవలప్ చేసిన
ప్రశాంత్ నీల్, ఫైనల్ గా ఒక మంచి పవర్ఫుల్ కథను సిద్ధం చేశారట.
అయితే ఈ సినిమాను మాత్రం
ఎన్టీఆర్ వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేద్దాం అని చెప్పడం జరిగినట్లు టాక్. ఎందుకంటే, అప్పటికే తయారు
ఆర్ఆర్ఆర్, అలానే
ప్రశాంత్ గారు కెజిఎఫ్ చాప్టర్ 2 వంటి భారీ సినిమాలు చేసి ఉంటారు కనుక, అంత భారీ అంచనాలతో కాకుండా వీలైనంత మీడియం బడ్జెట్ తో దానిని తెరకెక్కిస్తే బాగుంటుందని ఆయన ఆలోచనట. అలానే ఈ
సినిమా విషయమై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. మరికొద్దిరోజులు గడిస్తేనే కానీ, ఇందులో పూర్తి నిజానిజాలు వెల్లడి కావు....!!