బిగ్ బాస్ సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మరోసారి హౌస్ లో మెరిశారు. ఫైనల్ కి చేరిన కంటెస్టెంట్లలో ఉత్సాహం నింపడానికి ఒక్కొక్కరుగా అందరూ వచ్చారు. అయితే వచ్చిన వారందరిలో ఎక్కువగా ఆకర్షించింది హేమ. ఈ బిగ్ బాస్ సీజన్ లో మొట్టమొదటి ఎలిమినేషన్ హేమ. ఫైర్ బ్రాండ్ అయిన హేమ అంత తొందరగా ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు.


కానీ ఆమె వ్యవహార శైలి ప్రేక్షకులకి రుచించక త్వరగా ఇంటికి పంపించారు. అయితే హేమ వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఎన్ని ఆరోపణలు చేసిందో చూస్తూనే ఉన్నాం.  శ్రీముఖి, రాహుల్ కి మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రతీ ఒక్కరికీ తెలుసు.


బయట ఎంతో స్నేహితులు అని చెప్పుకునే ఈ ఇద్దరు హౌస్ లో అంతలా అరుచుకోవడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే శ్రీముఖి, రాహుల్ మధ్య జరిగిన గొడవలు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, అవన్నీ వారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకముందే ప్లాన్ చేసుకున్నారని చెప్తూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరొసారి హేమ శ్రీముఖిని టార్గెట్ చేసింది. శుక్రవారం ఎపిసోడ్ లో ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్లు మరోసారి హౌస్ కి రావడం జరిగింది.


అపుడు శ్రీముఖి హేమ కాళ్ళకి దండం పెట్టడానికి వెళ్తుంటే, హేమ "వద్దు తల్లోయ్" అంటూ దూరం జరుగింది. హేమ అలా చేసేసరికి శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అయింది. మరి హేమ కామెడీగా అన్నదా? లేక సెటైరికల్ గా టార్గెట్ చేసిందా అన్నది తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: