టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకేవ్వరు సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మహేశ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ఓవైపు మహేశ్ బాబు, మరియు అనిల్ రావిపూడి దూసుకెళ్తుండడంతో, ప్రస్తుతం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, బండ్ల గణేశ్, సంగీత, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇటీవల మహేశ్ మరియు దేవిశ్రీ ల కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాల ఆడియోలు ఎంతో మంచి సక్సెస్ సాదించిన  విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవిశ్రీ, ఈ సినిమా కోసం మరింతగా అదిరిపోయే సాంగ్స్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మరోవైపు, ఈ సినిమాతో పాటు సంక్రాంతి కానుకగా అదే రోజున రిలీజ్ కాబోతున్న బన్నీ, త్రివిక్రమ్ ల అలవైకుంఠపురములో సినిమా ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసి ముందుకు దూసుకుపోతుండడంతో, సరిలేరు టీం కూడా అతి త్వరలో తమ సినిమా నుండి సాంగ్స్ రిలీజ్ చేయడానికి అన్ని విధాలా సిద్దం అవుతోందట.

ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని తొలి సాంగ్ ని ఈనెల 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ పాటికే సాంగ్స్ రిలీజ్ కావలసి ఉందని, అయితే రికార్డింగ్ కొంత ఆలస్యం అవడంతో ఇంత టైమ్ పట్టిందని చెపుతోందట సరిలేరు టీం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి. మరి సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాలంతో రిలీజ్ కాబోతున్న సరిలేరు నీకేవ్వరు సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: