మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, తొలిసారి తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఆ సినిమాను నిర్మించడం జరిగింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో మెగాస్టార్ మరొక్కసారి తన బాక్సాఫీస్ స్టామినాని టాలీవుడ్ కి రుచి చూపించారు. ఇకపోతే ఇటీవల స్వాతంత్రోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్, ఆ సినిమాతో తన చిరకాల కల నెరవేరిందని అంటున్నారు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సెకండ్ వెంచర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అమితాబ్ వంటి మరికొందరు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు నటించడం జరిగింది. ఇకపోతే దాని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోయే తాజా సినిమా తాలూకు పూజ కార్యక్రమం ఇటీవల ఎంతో వైభవంగా జరిగాయి. అతి త్వరలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే కొద్దిరోజల క్రితం మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమా చేయనున్నారు అని అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి ఆడుతున్న సమాచారం ప్రకారం, 

సినిమా దాదాపుగా తెరకెక్కే అవకాశం లేనట్లు చెప్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం బన్నీతో అలవైకుంఠపురములో సినిమాను తీస్తున్న త్రివిక్రమ్, ఆ తరువాత ఏకంగా ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలను లైన్లో పెట్టారని అంటున్నారు. ఆ ప్రకారం ఆయన ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసే అవకాశం ఉందని, కాబట్టి ఇక మెగాస్టార్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో రాబోయే సినిమా చాలావరకు అటకెక్కినట్లే అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: