ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం వైరల్ గా మారి అటు సెలబ్రెటీలకు ఇటు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  తాము ఎంతగానో అభిమానించే హీరో, హీరోయిన్ కి ఏదో జరిగిందని లేని పోని వార్తలు రాయడం..అవి కాస్త వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఒక్కోసారి గుండె పోటు వచ్చి కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.  ఇక సెలబ్రెటీలు ఏకంగా చనిపోయారు..పెద్ద ప్రమాదం జరిగింది? వార్తలు రావడం అవి కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం.

అయితే ఆ వార్తలు నిజం కావు బాబో అని స్వయంగా సెలబ్రెటీలు క్లారిటీ ఇచ్చుకునే వరకు వైరల్ అవుతూనే ఉంటారు.  తాజాగా ఇప్పుడు ఇలాంటి వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.  తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 రేపటితో ముగియబోతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖినే విజేతగా నిలబెట్టాలని ఆమె అభిమానులు హోరెత్తిస్తున్నారు. శ్రీముఖి సోషల్ మీడియా టీం కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. 


ఈ నేపథ్యంలో తాజాగా ఓ వైరల్ పిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసినట్లు, ఆమె టైటిల్ అందుకుని నాగార్జునని కౌగిలించుకున్నట్లు ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే గతంలో కూడా బిగ్ బాస్ లో కొన్ని ఫోటోలు ముందుగానే లీక్ కావడం...అవి కూడా నిజం కావడం జరిగింది.

మరి ఈసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫోటో నిజమా? అబద్దమా అనేది తెలియాలి. కాకపోతే ఫైనల్ పోరులు రాహుల్, శ్రీముఖి నిలుస్తారని మొదటి నుంచి అనుకుంటున్న విషయమే..కాకపోతే ఇది మార్ఫింగ్ ఫోటోనా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ వేదిక నుంచి ఫోటో అంత సులువుగా లీక్ కాదు.


ఇది తప్పకుండా మార్పింగ్ ఫోటోనే అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. శ్రీముఖి అభిమానులు ఈ ఫోటో క్రియేట్ చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఆమె అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేసి ఉంటారనే ప్రేక్షలులు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు శ్రీముఖి అభిమానులు ఇదే నిజం అయితే బావుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: