బుర్రా సాయి మాధవ్" ప్రస్తుతం టాలివుడ్ లో ఒక ఊపు ఊపేస్తున్న మాటల రచయిత. కృష్ణం వందే జగద్గురుం సినిమా నుంచి మొదలు పెడితే గౌతమి పుత్ర శాతకర్ణి, తాజాగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా వరకు ఆయన విజయవంతమైన మాటల రచయిత అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` మాటలు రాస్తున్నారు. సినిమా విజయంలో ఆయన కూడా పాత్ర పోషించడంతో దర్శక నిర్మాతలు ఆయన సహకారం తీసుకునేందుకు పోటీ పడటం విశేషం.


ఆయన పని తీరుపై అటు అగ్ర హీరోలు, ఇటు సినిమాలకు కథలు అందించిన రచయుతలు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఆయ‌న ప‌నిత‌నాన్ని ఒక‌ట్రెండు వేదిక‌ల‌పై అగ్ర ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా మెచ్చుకున్నారు. ప్రస్తుత రచయితల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సాయి మాధవ్ కి ఇప్పుడు వాళ్ళే తల నొప్పిగా మారారని అంటున్నారు.


ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఒకసారి చూస్తే... సినీ ర‌చ‌యిత‌ల సంఘం ర‌జ‌తోత్స‌వ వేడుకలు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రయంలోనే దాదాపు పది మంది వ‌ర్థ‌మాన ర‌చ‌యిత‌ల‌కి అభినందన కార్యక్రమాన్ని కూడా పరుచూరి బ్రదర్స్ ఏర్పాటు చేసారు. అందులో ఒక‌ట్రెండు సినిమాలు చేసిన ర‌చ‌యిత‌లు కూడా ఉన్నారు. సాయిమాధ‌వ్ బుర్రా పేరు మాత్రం ఆ జాబితాలో కనపడలేదు.


స‌త్కారం పొందే ర‌చ‌యిత‌ల జాబితాని త‌యారు చేసిన పరుచూరి బ్రదర్స్ ఆయన పేరుని పక్కన పెట్టారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. సాయి మాధవ్ తో సైరా సినిమా సమయంలో వివాదం నెలకొందని అందుకే ఆయనపై పరుచూరి బ్రదర్స్ ఆగ్రహంగా ఉన్నారని అందుకే పక్కన పెట్టారని అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వ అవాస్త‌వాలు ఎలా ఉన్నాయో ?  వాళ్ల‌కే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: