గత రెండు నెలలుగా  తెలుగు రాష్ట్రాల పై డెంగ్యూ మహమ్మారి  పంజా విసురుతూనే  వుంది.  దీని భారీన పడి ఇప్పటికే  వందల మంది ప్రాణాలు కోల్పోగా  తాజాగా  రాము అనే యువకుడు  ఈరోజు డెంగ్యూ తో మృత్యువాత పడ్డాడు. రాము, సూపర్ స్టార్  మహేష్ బాబుకు  వీరాభిమాని.  దాంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదిక గా  అతని మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.  ఇటీవల నందమూరి  బాలకృష్ణ  అభిమాని  డ్రామా జూనియర్స్   ఫేమ్  గోకుల్  కూడా  డెంగ్యూ తో  ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు తాజాగా  మహేష్ అభిమాని కూడా  డెంగ్యూ కు బలైయ్యాడు.




ఇక ప్రస్తుతం మహేష్ బాబు  సక్సెస్ ఫుల్  డైరెక్టర్  అనిల్ రావిపూడి డైరెక్షన్ లో  'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నాడు.  క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై  ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు  వున్నాయి.  ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. అందులో  భాగంగా  పొల్లాచ్చి లో  కొన్ని  కీలక సన్నివేశాలను  తెరకెక్కిస్తున్నారు.  త్వరలోనే ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ వెలుబడనుంది.  




ఈ చిత్రంతో విజయశాంతి 13 ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.  ఆమె పాత్ర సినిమాకు కీలకం కానుందట. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: