టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అల వైకుంఠపురములో'. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు లిరికల్ సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయి అత్యద్భుత రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 

అయితే గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా మాదిరిగానే ఈ అల వైకుంఠపురంలో సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే త్వరలో ఈ సినిమా నుండి 'డాడీ డాడీ' అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేయబోతోందట. దీనిని బట్టి  ఫాదర్ మరియు సన్ మధ్య మంచి ఎమోషన్ తో ఈ  సాంగ్ ఉండనున్నట్లు అర్ధం అవుతుంది. సో, దీనిని బట్టి మరొక్కసారి ఫాదర్ సెంటిమెంట్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

సీనియర్ నటి టబు ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మరి సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: