గత కొద్ది రోజులుగా
యువ సామ్రాట్
కింగ్ అక్కినేని
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న
బిగ్ బాస్ సీజన్ 3 ఎంతో రసవత్తరంగా సాగి, ఎట్టకేలకు నిన్న రాత్రి ముగిసింది. ఇక
బిగ్ బాస్ హౌస్ లో ఫైనలిస్టు లుగా మిగిలిన
బాబా భాస్కర్,
ఆలీ,
వరుణ్ సందేశ్,
శ్రీముఖి,
రాహుల్ లలో ఫైనల్
విన్నర్ గా
రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ లెవల్లో కన్నుల పండుగగా జరిగిన నిన్నటి ఫైనల్
ఎపిసోడ్ కి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి
విన్నర్ అయిన
రాహుల్ కు అవార్డును అందించడం జరిగింది. ఇక ఈ సీజన్ లో రన్నరప్ గా శ్రీముఖి నిలిచింది.
మొదటి నుంచి ఎంతో క్రేజ్ తో కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 3 నేటితో ముగియడంతో, ఇక వచ్చే ఏడాది జరగబోయే సీజన్ 4 కి ఎవరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు అనే దాని పై ప్రేక్షకులు అప్పుడే అంచనాలు మొదలెట్టేశారు. ఇక నిన్నటి షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన
మెగాస్టార్ చిరంజీవి గారు, రాబోయే సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. వాస్తవానికి అందుకోసమే ఆయనను ఈ సీజన్ ఫైనల్
ఎపిసోడ్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగిందని అంటున్నారు.
అయితే తదుపరి సీజన్ మొదలవటానికి ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే ఆ సీజన్ కు హోస్ట్ గా మెగాస్టార్ వ్యవహరిస్తారు అంటూ వార్తలు రావడం ఒకరకంగా నమ్మదగిన విషయం కాదని, దానికి ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ వార్త నిజమే అని, ఇప్పటికే ఈ విషయమై
బిగ్ బాస్ టీమ్
మెగాస్టార్ ని సంప్రదించగా, ఆయన కూడా అందుకు సమ్మతించారని చెప్తున్నారు. మరి ప్రస్తుతం పలు వీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద
పండుగ వార్త అని చెప్పాలి......!!