తెలుగు లో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ మూవీతో అచ్చమైన
తెలంగాణ అమ్మాయిగా తెలుగు రాష్ట్ర ప్రజల మనసు దోచింది సాయిపల్లవి. వాస్తవానికి సాయిపల్లవి గతంలో టివి డ్యాన్స్ షోస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. అయితే మాలీవుడ్ లో ‘ప్రేమమ్’ మూవీతో మంచి విజయం అందుకున్న సాయి పల్లవి తర్వాత తెలుగులో ‘ఫిదా’ తో మంచి విజయం అందుకుంది.
భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల’.. అంటూ కుర్రకారుని ‘ఫిదా’ చేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుసగా ఛాన్సులు వచ్చాయి. మలయాళంలో మల్లర్గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన డాన్స్తో అభిమానులను అలరిస్తూ.. తన నటనలో సహజంగా ఉండాలనేదే ఆమె పాలసీ. అందుకే అతి తక్కువ మేకప్తో వెండితెరపై కనిపిస్తుంటారు. ఇటీవల కాస్మెటిక్స్ సంస్థ ఆమెకు భారీ మొత్తం ఆఫర్ చేసి... తమ ప్రకటనలో నటించమని కోరింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ఉత్పత్తుల ద్వారా మోసం చేయడం తనకు ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసిందట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ..మాట్లాడుతూ.. ‘నేను మీలోని ఓ అమ్మాయినే. జీవితంలో నేను ఓ సందర్భంలో అభద్రతగా ఫీలయ్యా. ‘ప్రేమమ్’
సినిమా కోసం ఆల్ఫోన్స్ నన్ను సెలెక్ట్ చేశారు. ఈ
మూవీ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. కొన్ని విమర్శిస్తూ..చాలా వరకు పొగడుతూ..వచ్చాయి. అయితే కెరీర్ లో ఇలాంటి కామెంట్స్ సహజం..గొప్పగా ఉన్నామని పొగిడితే పొంగిపోవడం..డౌన్ అయ్యామని విమర్శిస్తే కుంగి పోవడం చేస్తే ఎప్పుడూ కెరీర్ లో ముందుకు సాగలేరని అన్నారు. అమ్మాయిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి, ఆత్మాభిమానంతో వ్యవహరించాలి’ అని చెప్పారు. స్క్రీన్పైన రియల్ ఉమన్ను చూపించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.