టాలీవుడ్ స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా పేరు సూర్య
సినిమా, ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతకముందు హరీష్
శంకర్ దర్శకత్వంలో బన్నీ నటించిన డీజే
సినిమా కూడా యావరేజ్ గా నిలవడంతో బన్నీ ఫ్యాన్స్ ఆయన నుండి మంచి హిట్
సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక నాపేరు సూర్య తరువాత కొంత గ్యాప్ తీసుకుని పలువురు దర్శకుల నుండి కథలు విన్న బన్నీ, ఆ తరువాత చివరిగా
త్రివిక్రమ్ చెప్పిన
అల వైకుంఠపురములో సినిమా కథకు పచ్చ జెండా ఊపి
సినిమా మొదలెట్టారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా,
డిసెంబర్ లో పూర్తి అయి,
జనవరి 12న
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ
సినిమా కథ ఇదేనంటూ నిన్న ఉదయం నుండి ఒక స్టోరీ లైన్ విపరీతంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. దాని ప్రకారం, ఒక గొప్ప ధనికుడైన కోటీశ్వరుడు మరియు పేదవాడైన కారు
డ్రైవర్, ఇద్దరూ కూడా మంచి స్నేహితులట. అయితే అనుకోని కొన్ని కారణాల వలన వారిద్దరూ చేసుకున్న ఒక ఛాలెంజ్ వలన, కోటీశ్వరుడి కొడుకు కారు
డ్రైవర్ కొడుగ్గా, అలానే కారు
డ్రైవర్ కొడుకు కోటీశ్వరుడి కొడుగ్గా పెరుగుతారట. అయితే వారిద్దరూ మరెవరో కాదు, ఒకరు
అల్లు అర్జున్ అయితే, మరొకరు అక్కినేని
సుశాంత్ అట. అలా పెరిగిన కొడుకులిద్దరూ, అనుకోకుండా తమ ఫ్యామిలిలో ఎదురైన ఒక ముఖ్య ఘటనను ఎదుర్కొని చివరకు ఏ విధంగా తమ సొంత తండ్రులకు మంచి పేరు తీసుకువచ్చారు అనే విధంగా
సినిమా కథ సాగుతుందట.
ఇక సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ మరియు నాలుగు సాంగ్స్ ఉంటాయని, అలానే
త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కి కొరతలేదని అంటున్నారు. అయితే దీనిపై కొందరు బన్నీ ఫ్యాన్స్ మాత్రం భయపడుతూ, ఈ విధంగా ఒకరి కొడుకు, మరొకరి కొడుకుగా పెరగటం వంటి రివర్స్ స్ట్రాటజీ చూస్తుంటే, ఈ
సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ తమ సోషల్
మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ
సినిమా కథ అసలు ఇదో లేక కాదో తెలియాలంటే మాత్రం
సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.....!!