బాలీవుడ్లో వివాదం అన్న పదానికి మారు పేర్లు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్. వీరిద్దరూ ఏం చేసినా అది సెన్సషనే. సాధారణంగా ఇతర సెలబ్రిటీలపై కామెంట్లు చేసేవారు వారి పేర్లను బయటికి చెప్పకుండా కామెంట్లు చేస్తుంటారు. కానీ రంగోలీ అలా కాదు. వారి పేర్లతో సహా బయటపెట్టి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె చెప్పే మాటల్లో కూడా లాజిక్ ఉందనే అనిపిస్తుంది. తాజాగా రంగోలీ మరోసారి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ తీయబోతున్న సినిమాపై మండిపడ్డారు.


కరణ్ జోహార్  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాముడి గురించి గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రంగోలీ స్పందిస్తూ.. ‘మన చిన్నప్పుడు టెస్ట్ బుక్స్‌లో బాబర్ గురించి ఎన్నో కథలు చదివాం. కానీ బాబర్ లాంటి వెధవను రాముడితో పోల్చే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు’ అన్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మీరు చిన్నప్పుడు బాబర్ గురించి ఏం చదివారో చెప్తారా?’ అని ప్రశ్నించాడు. 



‘మా హిమాచల్ ప్రదేశ్ బోర్డ్ హిస్టరీలో బాబర్ అరాచకాలను వివరిస్తూ ఎన్నో చాప్టర్స్ ఉండేవి. బాబర్ కొడుకు హుమాయున్. వారి పాలన ఎలా ఉండేది. తమ భార్యలను ఎలా హింసించేవారు ఇవన్నీ చదివాం. ఆ తర్వాత కొందరు అతివాదులు బాబర్‌ను గొప్ప వ్యక్తిగా, రాముడిని కల్పితంగా మార్చేశారు. ఓ హంతకుడిని గొప్ప వ్యక్తిని చేస్తే ఈ దేశం ఏమైపోతుంది? ఇప్పుడు కరణ్ జోహార్ గారు తఖ్త్ సినిమా పేరుతో ఔరంగ్‌జేబ్ లాంటి వెధవ గురించి చూపించాలనుకుంటున్నారు.

అతనికి ఎన్ని అక్రమ సంబంధాలున్నాయి అని ఈ సినిమాలో చూపించబోతున్నాడు అని ఆమె చెప్పారు .ఇలాంటి పనికిమాలిన దర్శకులు ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ దేశాన్ని కించపరిచే ముందు చరిత్రలోని పాత్రలను తెరపై చూపిస్తూ వారికి ఎన్ని ఎఫైర్స్ ఉన్నాయో చూపించడం మానుకోవాలి అని అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: