పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తారన్న రూమర్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. దానికి తోడు అన్నట్లుగా
పవన్ తనకు సినిమాలు తప్ప మరోటి తెలియదని చెప్పడం, అందరికీ వ్యాపారాలు ఉన్నాయని అనడం గమనార్హం. ఇక రాజకీయాల్లోకి వచ్చిన వారు తమ సొంత
బిజినెస్ లను వదిలేసారా అని పవన్ ప్రశ్నించడంతో అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది.
దీంతో
పవన్ మళ్ళీ సినిమాల్లోకి వస్తారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపధ్యంలో దిల్ రాజు,
బోనీ కపూర్ కలసి హిందీలో భారీ హిట్ అయిన పింక్ మూవీని
రీమేక్ చేస్తారని అంటున్నారు. ఈ
మూవీ అయితే
పవన్ రీ ఎంట్రీకి కరెక్ట్ యాప్ట్ అని కూడా అంటున్నారు. ఇక ఈ మూవీలో
హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది.
పవన్ పక్కన అనేక పేర్లు ఇప్పటివరకూ వినిపిస్తున్నాయి.
అందులో
నయనతార కూడా ఒకరు. ఆమె తెలుగులో
పవన్ తో ఒక్క
సినిమా కూడ చేయలేదు కాబట్టి ఫ్రెష్ కాంబినేషన్ అని కూడా అంటున్నారు మరో వైపు తెలుగు తెరను అదరగొడుతున్న
పూజా హెగ్డే అయితే బాగుంటుంది అన్న మాట కూడా వినిపిస్తోంది. పూజాను
పవన్ సరసన నటింప చేసేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు.
పింక్
రీమేక్ లో తాప్సీ పోషించిన పాత్రకు పూజ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని అని అంటున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా ఆమె ఒకే చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ మూవీకి వేణు శ్రీ రాం డైరెక్షన్ చేస్తాడని కూడా అంటున్నారు. మొత్తం మీద చొసుకుంటే
పవన్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ఉనటుందని అంటున్నారు. ఇక
పూజా అయితే ఆ హీటే వేరు అని కూడా చెబుతున్నారు.