రకుల్ ప్రీతి సింగ్ తెలుగులోకి వెంకటాద్రి ఏక్సప్రెస్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రకుల్ కు తెలుగులో పెద్ద పెద్ద హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. దీనితో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ కు వచ్చింది. సీనియర్ హీరోయిన్లు కొందరు 15 ఇయర్స్ కూడా తమ కెరీర్ కొనసాగించగలిగారు కానీ ఈ కాలం హీరోయిన్లకు మాత్రం అది చాలా కష్టంగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే ఓ రెండేళ్ళ క్రితం సూపర్ ఫామ్ లో ఉండేది కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాలే లేవు. దీంతో తన ఫోకస్ పూర్తిగా హిందీపై పెట్టాల్సి వస్తోంది. నిజానికి రకుల్ 'స్పైడర్'(2107) తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
తరువాత ఎన్టీఆర్ కథానాయకుడితో ఒక చిన్న పాత్రలో కనిపించినా పెద్దగా పేరు లేదు. ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వటంతో రకుల్ కు ఒరిగిందేమి లేదు. ఈ ఏడాది అక్కినేని నాగార్జున సినిమా 'మన్మథుడు-2' లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడం సంగతి పక్కన పెడితే రకుల్ ఇమేజ్ ని దెబ్బతీసింది. దీంతో అప్పటి నుంచి రకుల్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ టాలీవుడ్ ఆఫర్ రాలేదని సమాచారం. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లోనూ హిందీలో ఒక సినిమాలోనూ నటిస్తోంది.
అయితే రకుల్ సింగ్ తెలుగులో అవకాశాలు రాకపోయే సరికే బాలీవుడ్ లో చేయటానికి ఆసక్తి చూపుతుంది. అయితే ఇలా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడికి పోతే ఒక్క చిక్కుంది.. టాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. గతంలో ఇలియానా విషయంలో ఇలానే జరిగింది. ఓవరాల్ గా చూస్తే రకుల్ కెరీర్ టాలీవుడ్ లో ముగిసినట్టేననిపిస్తోంది. ఎందుకంటే పెద్ద స్టార్ హీరోలు ఎవ్వరూ తమ సినిమాలకు రకుల్ పేరును పరిశీలించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా ఏవైనా క్రేజీ అవకాశాలు సాధించి అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.