తెలుగు లో వచ్చిన
బిగ్ బాస్ 3 విన్నర్ గా సింగర్ రాహూల్ సిప్లిగంజ్ నిలిచారు. పదిహేడు మంది కంటిస్టెంట్స్ తో మూడు నెలల పాటు వినోదం అందించారు బిగ్ బాస్.
బిగ్ బాస్ లో కి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం నటి హేమ్ ఎలిమినేట్ కావడంతో మొదటి వారం కాస్త హడావుడి కొనసాగింది. తర్వాత ఇంటి సభ్యులు ఒక్కొరూ ఎలిమినేట్ కావడం..ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు కన్నీటితో వీడ్కోలు చెప్పడం చూశాం. ఈసారి
బిగ్ బాస్ లో మొదటి నుంచి బబ్లీగా ఉంటూ..హంగామా సృష్టించింది నటి, యాంకర్ శ్రీముఖి.
మొదటి సారిగా
బిగ్ బాస్ లోకి
వరుణ్ సందేశ్, వితిక భార్యాభర్తలు ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో వీరిద్దరిలో ఎవరో ఒకరు
విన్నర్ అవుతారని భావించారు. కానీ అలా జరగలేదు..కాకపోతే
వరుణ్ సందేశ్ మాత్రం టాప్ 5 లో నిలిచారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3
విన్నర్ శ్రీముఖి అని నెటిజన్లు భావించారు. ఆ మద్య దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్గా మారింది. నాగ్ ని ట్రోఫితో
శ్రీముఖి కౌగిలించుకున్నట్లు ఫోటో వైరల్ కావడం జరిగింది. అయితే
బిగ్ బాస్ ఫైనల్స్ గా రాహూల్,
శ్రీముఖి చేరుకున్నారు. వీరిని
నాగార్జున స్టేజ్ పైకి పిలిచి కాస్త ఉత్కంఠత రేపుతూ..రాహూల్ చేయి పైకి లేపాడు.
బిగ్ బాస్ సీజన్ 3 కి రాహూల్
విన్నర్ గా ప్రకటించారు. ఈసారి
బిగ్ బాస్ 3 విన్నర్ కి
మెగాస్టార్ చిరంజీవి ట్రోఫిని అందించారు. తాజాగా రాహూల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ 3 విన్నర్ గా గెలవడం యాంకర్ ఝాన్సీకి పెద్దగా ఇష్టం లేనట్టే అనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించిన తీరే చెబుతుంది. ఈసారైనా మహిళను గెలిపిద్దామని
శ్రీముఖి అభిమానులు ప్రచారం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై యాంకర్ ఝాన్సీ స్పందించింది.
అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదని, అలాంటిది ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్బాస్ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించింది. లింగభేదం ఇప్పటికీ ఉందని సోషల్ మీడియాలో పేర్కొంది. అందరూ ఈసారి
బిగ్ బాస్ 3 విన్నర్ ఒక
మహిళ గెల్చుకుంటుందని ఎంతో ఆశపడ్డారు..కానీ అలా జరగలేదు. కాగా, బిగ్బాస్ హౌస్లో
శ్రీముఖి పర్ఫార్మెన్స్ పై ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.